NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravati: మూడు రాజధానుల అంశంపై బీజేపీ ఎంపీ జీవిఎల్ కీలక వ్యాఖ్యలు

Amaravati: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహారావు మూడు రాజధానుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతంలో శనివారం ఆయన పర్యటించి టిడ్కో ఇళ్లు, ఎస్ఆర్ఎం, విట్, ఎన్ ఐ డీ కాలేజీలను నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులు అనేది వైసీపీ రాజకీయ ఎత్తుగడే అని విమర్శించారు. హైకో్ర్టు తీర్పు అమల్లో ఉండగా మూడు రాజధానులు అంటే తీర్పును దిక్కరించినట్లేనని అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లలేదన్నారు. మూడు రాజధానులు సాధ్యం కాదని జగన్ కు అర్ధమైపోయిందని లేదంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం చేసే వారని అన్నారు.

BJP mp gvl comments on amaravati capital
BJP mp gvl comments on amaravati capital

Amaravati: అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి

రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తోందని జీవిఎల్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం పనులు చేయకుండా అభివృద్ధిని అటకెక్కించిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కూడా అసమర్ధత వల్ల పనులు చేయలేదని అన్నారు. ఇదే అదనుగా జగన్ రాజధాని నిర్మాణ పనులు నిలిపివేశారన్నారు. అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయా సంస్థలకు తాను లేఖ రాసినట్లు చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని జీవిఎల్ సూచించారు. రాజకీయాల కోసం అమరావతిని బలి చేయవద్దని ఎంపి అన్నారు.

పూర్తి సామర్ధ్యం మేరకు కేంద్రం ఏపికి సాయం

అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని బీజేపీ గతంలోనే తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి కనీస వసతులు కల్పిస్తే అమరావతి అభివృద్ధి చెందుతుందని అన్నారు జీవిఎల్. ప్రముఖ సంస్థలు రాజధానికి రావాలంటే మౌలిక సదుపాయలు ముఖ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పూర్తవుతోందన్నారు. కేంద్రం పూర్తి సామర్ధ్యం మేరకు ఏపికి సాయం చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సాకుగా చూపిి రాజధానిలో అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానులపై బిల్లు తీసుకువచ్చే ప్రసక్తి లేదని జీవీఎల్ స్పష్టం చేశారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju