AP CM YS Jagan: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ పోరం లో డీకార్బనైజ్డ్ మెకానిజం పై జరిగిన సదస్సులో ఏపి సీఎం వైఎస్ జగన్ ఇటీవల కర్నూలులో శంకుస్థాపన చేసిన ప్రపంచంలోనే అతి పెద్దదైన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు గురించి వివరించారు. కర్నూలులో నిర్మిస్తున్న విండ్, హైడల్, సోలార్ పవర్ ప్రాజెక్టులో అనుసరిస్తున్న టెక్నాలజీతో 33వేల మెగా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని చెప్పారు సీఎం జగన్, ఈ మహాత్తర కార్యక్రమంలో భాగస్వామయ్యేందుకు ఏపి తరపున పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణం పట్ల ప్రేమ, విశాల ధృక్పద ఆలోచనలు ఉన్న వారికి ఏపిలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ కు సంబంధించి షోకేస్ గా కర్నూలు ప్రాజెక్టు నిలుస్తుందని కేవలం పంప్డ్ స్టోరేజ్ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయడం సాధారణ విషయం కాదని అన్నారు సీఎం జగన్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నీతి ఆయోగ్ చైర్మన్ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ కర్బణ రహిత పవర్ ఉత్పత్తికి భారత్ లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఏపిలో పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించినట్లు అర్సెల్లార్ తరపున ఆదిత్య మిట్టల్ తెలిపారు. రాబోయే రోజుల్లో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తామని చెప్పారు. త్వరలో ఏపిలో తొలి పునరుత్పాదక పవర్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని మిట్టల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు ఏపి సీఎం వైఎస్ జగన్ ..బహ్రెయిన్ ఆర్ధిక మంత్రి సల్మాన్ ఆల్ ఖలీషాతో భేటీ అయ్యారు. ఏపిలో పెట్టుబడులకు గల అవకాశాలపై అరువురు చర్చించుకున్నారు.