NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..అగ్రవర్ణాలకు కూడా..అర్హతలు ఇవీ

jyothi paper targeted ys jagan

విదేశాలలో విద్యను అభ్యసించే ఏపీ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాల్లో విధ్యను అభ్యసించే వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్ధుల కోసం జగనన్న విదేశీ విద్యా దీవెనపై ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వలు జారీ చేసింది. ఇకపై వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి రూ.8లక్షల లోపు ఆదాయం పొందే వారి పిల్లలు ఈ పథకాన్ని పొందవచ్చు. అయితే కొన్ని నిబంధనలు పేర్కొంది. క్యూఎస్ ర్యాంకింగ్ లో ప్రపంచంలోని మొదటి 100 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్ధులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తుంది. 100 పైబడి 200 ర్యాంకింగ్స్ లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50లక్షల వరకూ ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తించనున్నది.

 

ల్యాండింగ్ పర్మిట్ లేదా ఐ – 94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా ఫీజు రీయింబర్స్ మెంట్ ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. మొత్తం నాలుగు వాయిదాల్లో సెమిస్టర్ల ఫలితాలు రాగానే ఫీజు రీయింబర్స్ మెంట్ నగదు జమ చేస్తారు. 35 ఏళ్లలోపు ఉన్న వారు అందరూ ఈ పథకానికి అర్హులు. ఏపికి చెందిన వారై ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ – డీసెంబర్ – జనవరి – మే మధ్య అర్హుల గుర్తింపు కోసం ప్రభుత్వం నోటిపికేషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ చేత అర్హుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.

 

గత ప్రభుత్వ హయాంలో రూ.6లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్న పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తించేది. విద్యార్ధుల సంఖ్యపై సీలింగ్, రూ.10 నుండి రూ.15 లక్షలు మాత్రమే ఆయా వర్గాలకు ఫీజు రీయింబర్స్ మెంట్ గా మంజూరు చేశారు. తాజాగా ప్రభుత్వం అగ్ర వర్ణాల వారితో పాటు విద్యార్ధుల పరిమితిని తీసేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ నగదును రూ.50లక్షల వరకూ పెంచింది ఈ సర్కార్. గత ప్రభుత్వం విదేశీ విద్యా దీవెనకు సంబంధించి 300 కోట్లకు పైగా బకాయి పెట్టింది.

బీజేపీ నేత సత్యకుమార్ గాలి తీసేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. మ్యాటర్ ఏమిటంటే..?

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?