భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని చుండూరు సభలో కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎంపీ వెంకటరెడ్డి సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అద్దంకి దయాకర్ ఇంతకు ముందే వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పారు. పార్టీ క్రమశిక్షణా సంఘం కూడా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెబితేనే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనే విషయంలో ఆలోచన చేస్తానని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పిలవని పేరంటానికి వెళ్లే వాడిని కాదనీ, తనను నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సమావేశాలకు ఆహ్వానించలేదని వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వెంకటరెడ్డికి క్షమాపణలు తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. చుండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు రేవంత్ రెడ్డి. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరిపైన చేసినా సరికాదని అన్నారు. వెంకటరెడ్డి తనను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినందున బేషరతుగా వెంకటరెడ్డికి క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కించపర్చడం తగదన్నారు. అద్దంకి దయాకర్ వాడిన వ్యాఖ్యలపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ మేరకు క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ దృష్టి సారించాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించిన నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అవుతోంది. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన స్పీకర్ పోచారం