కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆక్రమణ తొలగింపునకు స్టే ఉత్తర్వులు తీసుకున్న గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ పిటిషన్ లకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పిటిషన్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటం గ్రామంలో అధికారులు రహదారి విస్తరణ పనులు ప్రారంభించిన నేపథ్యంలో పలువురు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో తమకు నోటీసులు ఇవ్వలేదని రైతుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నాడు కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే తాము నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చేశామని ఇటీవల విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆగ్రహించిన ధర్మాసనం 14 మంది పిటిషనర్లు ఈ రోజు హైకోర్టుకు హజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇప్పటం గ్రామస్తులు ఇవేళ కోర్టుకు హజరైయ్యారు. గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం .. స్టే ఉత్తర్వుల కోసం తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు గానూ ఒకొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు నోటీసులు..?