తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓ ధర్మారెడ్డి కుమారుడి మరణంతో సెలవు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఈఓ ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ ఇవేళ శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం బంగారు వాకిలి వద్ద ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
అదనపు ఈఓ(ఎఫ్ఎసి) వీరబ్రహ్మం ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ(ఎఫ్ఎసి) శ్రీ వీరబ్రహ్మం, జెఈఓ సదా భార్గవి తో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్ ఓ నరసింహ కిషోర్, డెప్యూటీ ఈఓలు కస్తూరి బాయి, రమేష్ బాబు, హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీకి దగ్గర అయ్యేందుకే చంద్రబాబు ఖమ్మం పర్యటన .. అటు తెలంగాణ, ఇటు ఏపీ అధికార పక్ష నేతల విమర్శలు