టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా లోని బురుగుపూడి లో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ వంగిపోయింది. రాజమండ్రి ఎయిర్ పోర్టు నుండి చంద్రబాబు కాన్వాయ్ బయలు దేరిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో టీడీపీ శ్రేణులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. వెనుక నుండి వస్తున్న ఓ కారు చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను దాటే ప్రయత్నంలో కారు ముందు భాగాన్ని ఢీకొట్టి ఆగకుండా కొద్ది దూరం వెళ్లి ఆగింది. ఈ కారు టీడీపీ శ్రేణులకు చెందినదా లేక వేరే వాళ్లదా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్వల్ప ప్రమాదమే కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కాగా చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం గోకవరంలో పర్యటించగా, స్థానిక నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలతో చంద్రబాబు ప్రజల్లోకి వెళుతున్నారు. నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు తమ పర్యటనలకు కొద్ది రోజుల పాటు విరామం ప్రకటించారు. మరల ఇక నుండి రెగ్యులర్ గా ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నారు.
ఏపి లో హాట్ టాపిక్ గా మారిన రాజధానిపై బుగ్గన సెన్షేషనల్ కామెంట్స్ .. మళ్ళీ తూచ్ అంటారా..?