NewsOrbit
న్యూస్

AP CM YS Jagan: చంద్రబాబు మేనిఫెస్టో పై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

AP CM YS Jagan:  ఇటీవల టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధ్యక్షుడు రాబోయే ఎన్నికలకు సంబంధించి మొదటి మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టో పై ఇప్పటికే వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండగా, తాజాగా ఆ మ్యానిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇవేళ కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధి డబ్బులను సీఎం జగన్ పంపిణీ చేశారు. బటన్ నొక్కి రైతుల ఖాతాలో నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతులకు మంచి చేయాలనే తాపత్రయం తో పథఖాలు రూపొందిస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దాని కన్నా మిన్నగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. నాలుగేళ్ల వరకూ ఇస్తామని మేనిఫెస్టో ప్రకటించామని కానీ ఇప్పుడు అయిదేళ్ల వరకూ ఇస్తామన్నారు. ఇప్పటి వరకూ ప్రతి రైతుకు రూ.54వేలు ఇచ్చామన్నారు.

AP CM YS Jagan Slams Chandra Babu

రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకూ రూ.31 కోట్లు పంపిణీ చేశామన్నారు. సీజన్ ముగిసే లోగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తామన్నారు. ఇదే సందర్భంలో మరో సారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు గుప్పించారు సీఎం జగన్. బాబు బతుకే కాపీ, మోసం, చంద్రబాబుకు క్యారెక్టర్, క్రెడిబిలిటీ రెండూ లేవని విమర్శించారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులేని పార్టీ టీడీపీ అని అన్నారు. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ టీడీపీ అని విమర్శించారు. పొత్తుల కోసం ఎలాంటి గడ్డికరవడానికైనా సిద్దపడే పార్టీ టీడీపీ అని మండిపడ్డారు. పొత్తులు, ఎత్తులు, కుయుక్తులు కలగలపిన పార్టీ టీడీపీ అని దుయ్యబట్టారు. మంచి చేయడం చంద్రబాబు డిక్షనరీలోనే లేదని అన్నారు. ఎవరికైనా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబుది అధికారం కోసం ఆరాటమనీ, దోచుకుని, దాచుకుని నలుగురూ పంచుకోవడానికే వీరి పోరాటమని విమర్శించారు. ధైర్యంగా ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదని మరో సారి విమర్శించారు.

చంద్రబాబు మేనిఫెస్టో ఏపిలో పుట్టలేదనీ, చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందన్నారు. కర్ణాటక రెండు పార్టీల మేనిఫేస్టోతో బిస్మిల్లా బాత్ వండేశాడనీ, అన్ని పార్టీల పథకాలను కాపీ చేసేసి మేనిఫెస్టో తీసుకొచ్చాడని, మన పథకాలను కాపీ కొట్టేసి పులిహోర కలిపేశాడని జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఆకర్షనీయమైన మేనిఫెస్టో..తర్వాత గెలిపించిన ప్రజలను పొడవడం బాబు పొలిటికల్ ఫిలాసవీ అంటూ ఫైర్ అయ్యారు. మేనిఫోస్టో ఎలా రూపొందించాలో బాబుకు తెలుసా అని ప్రశ్నించారు. ప్రజల గుండె చప్పుడుగా వైసీపీ మేనిఫెస్టో పుట్టిందన్నారు. డ్రామా కంపెనీ మాదిరిగా రాజమండ్రిలో మహానాడు నిర్వహించారని విమర్శించారు సీఎం జగన్.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju