NewsOrbit
జాతీయం న్యూస్

G 20 Summit: జీ 20 సదస్సులకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన దేశ రాజధాని ఢిల్లీ .. బ్రిటన్ ప్రధానిగా, భారత దేశ అల్లుడు రిషి సునాక్ సతీసమేతంగా..

G 20 Summit: జీ 20 శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపు ఎల్లుండి జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అంతర్జాతీయ ఆర్ధిక అంశాలతో పాటు ప్రపంచీకరణ బలోపేతంలో జీ 20 దేశాల కూటమి కీలక పాత్ర పోషిస్తొంది. ప్రపంచ ఆర్ధిక సహకారానికి కీలక వేదికగా నిలిచే జీ 20 దేశాల ప్రతిష్టాత్మక సదస్సుకు తొలి సారిగా భారత్ అతిధ్యమిస్తొంది. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు హజరు కావడం లేదు. సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాధినేతలు తరలివస్తున్నారు.

 

ఇప్పటికే జపాన్ ప్రధాని కిషిందా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటేరన్, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో, ఐఎంఎఫ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టోలినా జార్జివా తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. అతిధులకు భారత్ ఘన స్వాగతం పలుకుతోంది. అతిధులను ఆహ్వానించేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ మీడియాతో మాట్లాడుతూ ఈ పర్యటన తనకెంతో ప్రత్యేకం అని పేర్కొన్నారు. ‘భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాన మంత్రి హోదాలో..అది కూడా ఇక్కడి అమ్మాయిని వివాహం చేసుకుని భారత దేశపు అల్లుడిగా ఇక్కడకు రావడం నాకెంతో అనందంగా ఉంది’ అంటూ చమత్కరించారు.

 

జీ 20 సమావేశాల సందర్భంగా ఢిల్లీని శత్రుదుర్భేద్యంగా మార్చేశారు. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు ప్రత్యేకంగా ప్లాగ్ మార్చ్ చేపట్టారు. అలాగే టూవీలర్స్ పెట్రోలింగ్ చేశారు. డ్రోన్లతో నిరంతరం నిఘాను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు రోజులు బిజీ బిజీ గా గడుపనున్నారు. 15 ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు.

ఈరోజు అమెరికా, మారిషన్, బంగ్లాదేశ్ అధినేతలతో భేటీ కానున్నారు. రేపు జీ – 20 సదస్సుతో పాటు యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోడీ లంచ్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అనంతరం విడిగా కెనడా దేశాధినేతతో భేటీ అవుతారు. అదే విధంగా కొమొరోస్, టర్కీ, యూఏఈ, దక్షిణ కొరియా, బ్రెజిల్, నైజీరియా, యూరోపియన్ యూనియన్ అధినేతలతో ప్రధాని సమావేశాలు జరుపుతారు.

AP CID: ఆ టీడీపీ ఎమ్మెల్యే కుటుంబానికి ఏపీ సర్కార్ బిగ్ షాక్ .. రూ.9 కోట్ల విలువైన ఆస్తులు జప్తు

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?