NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబు కేసుల్లో ఏ కోర్టుల్లో పరిస్థితి ఏమిటంటే..?

Chandrababu Arrest:  స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించి పిటిషన్లు ఇటు ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమిటంటే.. సుప్రీం కోర్టులో చంద్రబాబు తరుపున క్వాష్ పిటిషన్ ను ఆయన న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా మెన్షన్ చేశారు.

ACB Court and Supreme Court hearing today on Chandrababu's petitions
Chandrababu’s petitions

ఇది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యవహారమని.. అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్ద న్యాయవాది లూథ్రా ప్రస్తావించారు. దీనిపై ఎన్ని రోజుల నుండి కస్టడీలో ఉన్నారని సీజేఐ ప్రశ్నించగా.. ఈ నెల 8న అరెస్టు చేశారని న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్ ను అత్యవసరం విచారించాలని కోరారు. దీంతో రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సిద్ధార్ధ లూథ్రాకు సీజేఐ సూచించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో ఆ ఉత్తర్వులను సావ్ చేస్తూ చంద్రబాబు రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మరో పక్క ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రమోద్ దూబే వాదనలు వినిపించగా, సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వివేకానంద కోర్టుకు హజరైయ్యారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరగా, ముందు కస్టడీ పొడిగింపు పై దాఖలైన పిటిషన్ పై వాదనలు వినాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. రెండు రోజుల సీఐడీ విచారణలో చంద్రబాబు సహకరించలేదన్నారు.

ACB remand Chandrababu naidu,

అందుకే మరో మూడు రోజులు కస్టడీ పొడిగించాలనీ, కేసు ఇప్పుడు కీలక దశలో ఉందని కావున కస్టడీ పొడిగింపు పిటిషన్ పై తమ వాదనలు వినాలని సీఐడీ న్యాయవాదులు కోరారు. దీంతో మెమో దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. మెమో దాఖలునకు సమయం ఇవ్వాలని సీఐడీ తరుపు న్యాయవాదులు కోరారు. కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తి అవ్వగానే బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మరో వైపు చంద్రబాబు కస్టడీ వద్దంటూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

Children’s Story: రాజులు మారెనో.. గుర్రాలు ఎగిరెనో | Pillala Kathalu

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju