YS Sharmila: మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లోనే నిర్బంధించారు. షర్మిల, కాంగ్రెస్ నేతలు బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు.
గురువారం పార్టీ కార్యాలయం వద్దకు రావాలని ప్రయత్నించిన నేతలు గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్ వలీలను అరెస్టు చేసి అక్కడ నుండి తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు అక్కడే భైఠాయించి ఆమె నిరసన తెలిపారు. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
పోలీసులు, పార్టీ శ్రేణులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారని విమర్శించారు. నాడు రాజశేఖరరెడ్డి 52వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ ఇచ్చారని గుర్తు చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్టు చేస్తున్నారని అన్నారు. 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి కేవలం ఆరు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారన్నారు
. రాజశేఖరరెడ్డి మార్క్ మెగా డీఎస్సీ అయితే జగన్ మార్క్ దగా డీఎస్సీ అని విమర్శించారు. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి 2లక్షల 30వేల ఖాళీలు ఉన్నాయని చెప్పారని అన్నారు. దీనిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల అణచివేత చర్యలు చూస్తుంటే ప్రభుత్వం భయపడుతోందని అర్ధం అవుతోందన్నారు.
Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!