అమరావతి: జనసేన, టిడిపికి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు మంగళవారం వైసిపిలో చేరారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టిడిపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తాడేపల్లిలో ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి జగన్ పార్టీ కండువాలు కప్పిసాదరంగా ఆహ్వానించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తదితరులు హజరయ్యారు.
previous post
next post