అమరావతి : రాష్ట్రంలో మద్యం ధరలు మళ్లీ పెరగనున్నాయి. రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ అమలు చేసిన సమయంలోనే క్వార్టర్ బాటిల్కు 20 రూపాయల చొప్పున పెంచిన విషయం తెలిసిందే. మళ్లీ మద్యం ధరలను పెంచుతూ గురువారం ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం మీద అదనపు పన్ను విధించడంతో ధరల పెంపు అనివార్యమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఏయే మద్యం ధరలు ఎంత మేరకు పెరగనున్నాయో ఉత్తర్వుల్లో వెల్లడించారు.
పెరిగిన మద్యం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
భారత్లో తయారైన విదేశీ మద్యం ధరలు 60 ఎంఎల్, 90 ఎంఎల్ బాటిల్ 30 రూపాయల చొప్పున పెరగనున్నాయి. భారత్లో తయారైన విదేశీ మద్యం 180 ఎంఎల్ మీద 60 రూపాయలు, 375 ఎంఎల్ మీద 120 రూపాయలు, 750 ఎంఎల్ మీద 240 రూపాయలు, 1000 ఎంఎల్ మీద 300 రూపాయలు, 2000 ఎంఎల్ మీద 750 రూపాయలు చొప్పున పెరగనున్నాయి.
ఇక విదేశీ మద్యం 50-60 ఎంఎల్ మీద 30 రూపాయలు, 200-275 ఎంఎల్ మీద 60 రూపాయలు, 330-500 ఎంఎల్ మీద 120 రూపాయలు, 700 – 750 ఎంఎల్ మీద 240 రూపాయలు, 1500/2000 ఎంఎల్ మీద 750 రూపాయలు చొప్పున పెరగనున్నాయి.
బీర్ 330-500 ఎంఎల్ మీద 30 రూపాయలు, బీర్ 650 ఎంఎల్ మీద 60 రూపాయలు చొప్పున పెరగనున్నాయి.ఇక ‘రెడీ టు డ్రింక్’ బ్రాండ్లు అన్నింటి మీద 60 రూపాయల ట్యాక్స్ చొప్పున పెరగనున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.