(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
వయనాడ్: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఉపన్యాసాన్ని ఒక 12వ తరగతి విద్యార్ధి మళయాళంలోకి తర్జుమా చేసింది. గురువారం తన నియోజకవర్గంలోని ఒక స్కూలులో సైన్స్ లాబ్ను ప్రారంభించిన రాహుల్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ఎప్పుడూ రాహుల్ ఉపన్యాసాలను తర్జుమా చేసే కాంగ్రెస్ నాయకుడు కెసి వేణుగోపాల్ అక్కడే కూర్చుని చూస్తూ ఉండగా, రాహుల్ తన ఉపన్యాసాన్ని ఎవరైనా మళయాళంలోకి తర్జుమా చేస్తారా అని విద్యార్దులను అడిగారు. 12వ తరగతి విద్యార్ధి సఫా సెబిన్ సంకోచం లేకుండా సహ విద్యార్ధుల కేరింతల మధ్య వేదికపైకి నడిచింది.
వేదికపైకి రాగనే ఆ అమ్మాయి రాహుల్కు నమస్తే అంటూ అభివాదం చేసింది. ప్రతిగా సెబిన్తో కరచలనం చేసిన రాహుల్ అమెకు మైక్ అందించి తాను మాట్లేడడం ప్రారంభించారు. సెబిన్ ఏమాత్రం తడుముకోకుండా రాహుల్ ఇంగ్లీష్ను మళయాళం లోకి తర్జుమా చేసింది. చివరన రాహుల్ చక్కగా తర్జుమా చేసినందుకు ఆమెను అభినందించారు. తర్వాత సెబిన్ ఎన్డిటివితో మాట్లాడుతూ, ఇది తన జీవితంలో గొప్ప అనుభవమని చెప్పింది.