తిరువనంతరపురం(కేరళ), జనవరి 16: ప్రధానమంత్రి మోదీ పర్యటనలో ఆంక్షలు వివాదాస్పదంగా మారాయి. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పధ్మనాభ స్వామి ఆలయానికి ప్రధాని మోదీతోపాటు వెళ్ళనీయకుండా ప్రధానమంతి కార్యాలయం తన పేరుతోపాటు మరికొందరి పేర్లను తొలగించిందని స్థానిక ఎంపీ శశిథరూర్ ఆరోపించారు.
మోదీతోపాటు ఆలయంలోకి ఎంపి, ఇతర నేతలను అధికారులు వెళ్లనీయలేదు. దీంతో ఆయన ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీయ జనతాపార్టీ కుటిల రాజకీయాలకు పిఎంఓ వ్యవహరించిన తీరు అద్దంపడుతోందని ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేశారు.