ఇటీవల దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల పనితీరుపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశానికి ఆరు సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్న మోడీ పనితీరుపై అదేవిధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ప్రజలు 65శాతం సానుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా కరోనా వైరస్ లాంటి ప్రమాదకరమైన విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలకు దేశ ప్రజలు జై కొడుతున్నారట. అదేవిధంగా దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల పనితీరుపై కూడా ‘సీ ఓటర్’ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి టాప్ 5 ముఖ్యమంత్రుల జాబితాలో చోటు దక్కింది. జగన్ పరిపాలన పట్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలు 78.1శాతం జై కొట్టారట. దీంతో జగన్ కి బెస్ట్ సీఎం గా దేశంలో నాలుగో స్థానం దక్కించుకున్నారని ‘సీ ఓటర్’ సర్వే నివేదికలో తెలిపింది. ముఖ్యమంత్రిగా పాలనాబాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాది కాలంలోనే అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది.
మొదటి స్థానంలో ఒడిషా ముఖ్యమంత్రి రెండో స్థానంలో ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ వాఘేలా, మూడో స్థానంలో కేరళ సీఎం పినరయి విజయన్ ఉండగా ఐదో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిలిచారు. కాగా ఈ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ లాస్ట్ రావడం జగన్ టాప్ లో ఉండటం గమనార్హం. దీంతో కేసిఆర్ ‘సీ ఓటర్’ సర్వే ఫలితాలపై స్పందిస్తూ బీజేపీ కి తలకాయ ఊపే రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మంచిగా ఇచ్చారు రేటింగ్ అని ఫీల్ అవుతున్నారట. అంతేకాకుండా తాను మరీ అంతా బ్యాడ్ గా పాలన చేయడం లేదు అని ఫీల్ అయినట్టు టాక్.