అందమైన చర్మం కోసం చందనం చెప్పే మరింత అందమైన చిట్కాలుతెలుసుకుందాం . చందనం, గులాబీ లు, ఈ రెండిటి కలియక అనేక సత్ఫలితాలను ఇస్తుంది, ఈ రెండింటిని కలిపి ముఖానికి పట్టించుకుంటే మీ చర్మం ఎంతో తాజాగా, అందంగా, మరియు యవ్వనంగా కనిపించడమే కాకుండా, మీ ముఖం పై ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోయి, మీ ముఖం మృదువుగా మారి ,ఎంతో కాతివంతంగా మెరుస్తుంది.
2 గులాబీ పూల రేకులు తీసుకుని, 2 టేబుల్ స్పూన్లు నూరిన వోట్స్ తీసుకుని, కొంచెం నీరు కలిపి, పేస్ట్ లాగా చేస్తే , 5 నిమిషాల్లో ఫేస్ ప్యాక్ రెడీ అయిపోతుంది. మీ చర్మం పొడిగా ఉంది అనిపించిన ప్రదేశంలో కొంచెం నీరుతో శుబ్రం చేసి ఈ మిశ్రమాన్ని పట్టించి 20 నిమిషాల తరువాత చూసుకుంటే, మీరు ఊహించని అందమైన, కోమలమైన,యవ్వనమైన చర్మం మీ సొంతం అవుతుంది.పాలలో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి సవ్య, అపసవ్య దిశల్లో మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ మన చర్మంలోని మొటిమలను, మచ్చలను తొలగించి యవ్వనమైన చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది. అయితే ఈ మిశ్రమంలో పసుపుని కూడా కలిపితే , చర్మంలో ఉన్న క్రిములని నాశనం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
1 టేబుల్ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ లు గంధం పొడి 3 టేబుల్ స్పూన్ లు తేనె ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ, శరీరం అంతా పట్టించుకోవాలి . 20 నిమిషాల తరువాత చల్లని నీటితోశుబ్రం చేసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.