Chandrababu Naidu- ACB Court: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గత 16 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. నిబంధనలు పాటించకుండా తనపై నమోదైన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ కి సుప్రీం కోర్టు లో నెంబర్ కేటాయింపు జరిగింది. అయితే బెంచ్ అనేది ఇంకా ఖరారు కాలేదు.
ఇవేళ మధ్యాహ్నం స్పెషల్ కేసుగా పరిగణించి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తొంది. లేకపోతే చంద్రబాబు తరపు న్యాయవాదులు సీజే ధర్మాసనం ముందు మెన్షన్ చేసి త్వరితగతిన విచారణకు అభ్యర్ధించే అవకాశం ఉందని అంటున్నారు.
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్దార్ద్ లూథ్రా, సిద్ధార్ధ అగర్వాల్ లు ఏపీ హైకోర్టులో బలమైన వాదనలు వినిపించినప్పటికీ, న్యాయమూర్తి ..సీఐడీ వాదనలకు ఏకీభవించి క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేశారు. మరో పక్క ఏసీబీ కోర్టులోనూ ఇవేళ చంద్రబాబుకు సంబంధించి మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ల పై విచారణ జరగనుంది.
అదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ స్కామ్ లలో చంద్రబాబుపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన రెండు పీటీ వారెంట్ పిటిషన్ లపై నా ఏసీబీ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏసీబీ కోర్టులో బెయిల్, పీటీ వారెంట్ల పై ఎటువంటి ఉత్తర్వులు వెలువడతాయి.. క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఏ విధంగా వాదనలు జరుగుతాయి..?
తీర్పు ఎలా ఉంటుంది..? ఊరట లభిస్తుందా ..? లేక బెడిసికొడుతుందా..? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కాగా చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ గడువు నిన్నటితో ముగియడంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5వ తేదీ వరకూ పొడిగించింది.
Chandrababu Arrest: ముగిసిన చంద్రబాబు సీఐడీ కస్టడీ .. చంద్రబాబు రిమాండ్ అక్టోబర్ 5వరకూ పొడిగింపు