Breaking: ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో సారి చుక్కెదురు అయ్యింది. చంద్రబాబు తరపున దాఖలైన హౌస్ రిమాండ్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. 14 రోజుల రిమాండ్ ఉత్తర్వుల నేపథ్యంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ను జైల్ లో వద్దు, గృహ నిర్బందం (హౌస్ రిమాండ్) ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపున దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టులో నిన్న వాదనలు జరిగాయి.
వాదనలు ముగిసన అనంతరం నిన్న సాయంత్రం తీర్పు వెలువడుతుందని భావించినప్పటికీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. కొద్ది సేపటి క్రితం తీర్పును వెలువరించారు. ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ద లుథ్రా వాదనలు వినిపించారు. రాజమండ్రి జైల్ కంటే మించిన సెక్యురిటీ ఎక్కడా ఉండదని అదనపు ఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు 50 అడుగుల గోడ ఉంటుందనీ, అక్కడకు ఎవ్వరూ రాలేరన్నారు. చంద్రబాబుకు ఇంట్లో కంటే జైలులోనే భద్రత ఉంటుందనీ, చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా ఉందని ఏఏజి తెలిపారు.
24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారనీ, ఆయన భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదనీ, జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గదితో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలియజేస్తూ చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డీజీ అదేశాల లేఖను న్యాాయమూర్తి ముందు ఉంచారు. గృహ నిర్బంధం పిటిషన్ ను డిస్మిస్ చేయాలని ఏఏజీ కోరారు. చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు ఇప్పటి వరకూ ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు కు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉందన్నారు. హౌజ్ కస్టడీ కి సంబంధించి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఉందని గుర్తు చేశారు.
ఆయన వయసు, హోదా దృష్ట్యా హౌజ్ రిమాండ్ ఇవ్వాలని కోరారు. జైలులో భద్రత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని , రాష్ట్ర ప్రభుత్వం భద్రత పై అనుమానంతోనే ఎన్ఎస్ జీ భద్రత ఉందని, ఆయన జైలులో ఉంటే ఎన్ ఎస్ జీ కమెండోలు బయటే ఉంటారని తెలిపారు. తీర్పుపై ఉత్కంఠ నెలకొనగా, కొద్ది సేపటి క్రితం న్యాయమూర్తి .. హౌస్ రిమాండ్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. ప్రభుత్వ వాదనలను ఏసీబీ కోర్టు ఏకీభవించి ఈ తీర్పు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
Breaking News: బ్రేకింగ్ : తెలుగుదేశం కొత్త అధ్యక్షుడు గా నందమూరి బాలకృష్ణ ?