ఏపిలో అత్యవసర సేవల ఫోన్ నెంబర్ 108 పని చేయడం లేదు. సాంకేతిక కారణాలతో అత్యవసర సేవల కాల్ సెంటర్ 108 నిలిచిపోయింది. సర్వర్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా అత్యవసర సేవల కాల్ సెంటర్ 108 పని చేయడం లేదు. ఈ విషయాన్ని ఆ సంస్థ అదనపు సీఇఓ మధుసూధనరెడ్డి తెలిపారు. అంబులెన్స్ సేవల కోరకు ప్రజలు 104 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు. సర్వర్ లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలతో పాటు పోలీస్, ఫైర్ ఎమర్జెన్సీ సేవలకు ప్రభుత్వం 108 ఫోన్ నెంబర్ ను కేటాయించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ఉన్న ప్రధాన కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను 108 అందిస్తొంది. అయితే ఈ రోజు ఉదయం నుండి 108 సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో అంబులెన్స్ సేవల కోసం ప్రజలు 104 కు కాల్ చేయాలని అధికారుుల విజ్ఞప్తి చేస్తున్నారు. 108 ఫోన్ నెంబర్ పని చేయనప్పటికీ అంబులెన్స్ సేవలకు ఎలాంటి విఘాతం కలగలేదని ప్రభుత్వం తెలిపింది.