CM YS Jagan: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రేపటికి (ఆదివారం) తుపానుగా మారే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. తుఫాను పరిస్థితులపై శనివారం సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను పరిస్థితులపై అధికారులను అడిగి సిఎం వివరాలను తెలుసుకున్నారు. ఈ నెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేసుకోవాలని, ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
సీఎం ఆదేశాల మేరకు 8 జిల్లాలకు ముందస్తుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తిరుపతి జిల్లాకు రూ.2 కోట్లు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ప.గో, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.1 కోటి చొప్పున విడుదల చేశారు.
Telangana Elections Counting: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి .. తొలి ఫలితం ఎన్ని గంటలకు అంటే..