AP CM YS Jagan: అధికార, వ్యక్తిగత పర్యటనలో భాగంగా పది రోజుల పాటు విదేశాలలో గడిపిన ఏపి సీఎం వైఎస్ జగన్ నేడు స్వదేశానికి చేరుకున్నారు. ఈ నెల 20వ తేదీన కుటుంబంతో సహా స్విట్జర్లాండ్ వెళ్లిన ఏపి సీఎం వైఎస్ జగన్..22,23,24 తేదీల్లో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. పలు పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సు అనంతరం 25వ తేదీ నుండి సీఎం జగన్ వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు.
విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం జగన్, మంత్రుల బృందం మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు గన్నవరం విమానాశ్రయంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రులు జోగి రమేష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తదితరులు ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. గన్నవరం నుండి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకున్నారు. కాగా దావోస్ పర్యటనలో సీఎం వైఎస్ జగన్ వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్, మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…