AP CM YS Jagan: అధికార, వ్యక్తిగత పర్యటనలో భాగంగా పది రోజుల పాటు విదేశాలలో గడిపిన ఏపి సీఎం వైఎస్ జగన్ నేడు స్వదేశానికి చేరుకున్నారు. ఈ నెల 20వ తేదీన కుటుంబంతో సహా స్విట్జర్లాండ్ వెళ్లిన ఏపి సీఎం వైఎస్ జగన్..22,23,24 తేదీల్లో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. పలు పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సు అనంతరం 25వ తేదీ నుండి సీఎం జగన్ వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం జగన్, మంత్రుల బృందం మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు గన్నవరం విమానాశ్రయంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రులు జోగి రమేష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తదితరులు ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. గన్నవరం నుండి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకున్నారు. కాగా దావోస్ పర్యటనలో సీఎం వైఎస్ జగన్ వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్, మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.