AP High Court: ఏపిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కౌంటింగ్ కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎంపీటీసీ, జడ్ పీటీసీ ఎన్నికల నిర్వహణలో సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించలేదని ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది మే 21న తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుపై ఎస్ఈసీతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టు డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆగస్టు 5న తీర్పును రిజర్వు చేసింది. ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెల్లడించింది.