Breaking: ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీ ఎత్తున నగదు పట్టుబడటం తీవ్ర సంచలనం రేకెత్తించింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద పద్మావతి ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. టోల్ ప్లాజా వద్ద పోలీస్ తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం నుండి గుంటూరు వెళ్తున్న ఏపి 39 టీబీ 7555 నెంబర్ గల పద్మావతి ట్రావెల్స్ బస్సును తనిఖీ చేశారు. బస్సు లగేజ్ డిక్కీలలో సీట్ల కింద నోట్ల కట్టలు ఉంచి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Breaking: ఒక్క బాక్సులోనే రూ.80 లక్షల నగదు
ఒక్క బాక్సులోనే రూ.80 లక్షల వరకూ నగదు ఉన్నట్లు అంచనా. ఇలాంటివి మరి కొన్ని బాక్సులు ఉండటంతో నగదు కోట్లలో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు టోల్ ప్లాజా కార్యాలయంలో భద్రపరిచి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారులు వచ్చిన తరువాత నగదు లెక్కించి కేసు నమోదు చేయనున్నారు. బస్సు డ్రైవర్ క్లీనర్ ను అదుపులోకి తీసుకుని నగదుపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అక్రమ మార్గంలో పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నారు అంటే ఇది అంతా బ్లాక్ మనీ అయి ఉండవచ్చని భావిస్తున్నారు.