NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విభజన సమస్యలపై కేంద్ర కీలక భేటీలో బిగ్ ట్విస్ట్ ఏమిటంటే..?

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవేళ కీలక భేటీ జరిగింది. అయితే ఎటువంటి నిర్ణయాలు లేకుండానే అసంపూర్తిగా సమావేశం ముగిసింది. మరో సారి భేటీ కావాలా వద్దా అన్న నిర్ణయం కూడా లేకుండానే భేటీ ముగించారు. రాష్ట్రాల విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నా ఏపి, తెలంగాణ మధ్య దాదాపు అన్ని అంశాల్లోనూ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్), ఇతర ఉన్నతాధికారులను ఆహ్వానించింది. ఈ సమావేశం సందర్భంగా ఎజెండాలో మొత్తం 14 అంశాలు ఉండగా వీటిలో ఏడు అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా మరో ఏడు అంశాలు ఏపికి సంబంధించినవి ఉన్నాయి.

 

సమావేశం సందర్భంగా శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకు రాజధాని నిర్మాణం కోసం రూ.29వేల కోట్లు ఇవ్వాలని ఏపి ప్రభుత్వం కోరగా ఇప్పటికే ఇచ్చిన రూ.15వేల కోట్లకు వివరాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కోరింది. ఇక రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. రైల్వే జోన్ నిర్ణయాన్ని కేబినెట్ కు వదిలివేయాలని హోంశాఖ కార్యదర్శి సూచించారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఏపి అధికారులు కోరగా ఇదేళ్లే ఇవ్వాలని నిర్ణయం జరిగిందని హోంశాఖ అధికారుుల పేర్కొన్నారు. షీలా బిడే కమిటీ సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని హోంశాఖ అధికారులు తెలపగా, తెలంగాణ అంగీకరించకపోయినా హోంశాఖ నిర్ణయం తీసుకోవచ్చని ఏపి తెలిపింది. దీనిపై న్యాయనిపుణుల సలహాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది.

AP TS Bifurcation Issues

 

ఏపి లేవనెత్తిన అంశానికి తెలంగాణ సమ్మతి తెలపలేదు. ఏపి ఫైనాన్స్ కార్పోరేషన్ సహా పలు సంస్థల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ అధికారులు చెప్పగా, పౌరసరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలున్నాయని ఏపి అధికారులు ప్రస్తావించారు. విభజన చట్టం ప్రకారం సింగరేణిని పంచాలని ఏపి ప్రభుత్వం కోరగా, తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. 51 శాతం ఈక్విటీని పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్నందున సింగరేణి విభజన అంశం ఉత్పన్నం కాదని పేర్కొంది. సింగరేణికి ఉన్న ఏకైక అనుబంధ సంస్థ ఏపి హెచ్ఎంఈఎల్ లో మాత్రమే ఏపి కి ఈక్విటీ వర్తిస్తుందని తెలుపగా ఈ విషయాన్ని పరిశీలించాలని అధికారులను హోంశాఖ కార్యదర్శి ఆదేశించారు.

విభజన చట్టంలో పేర్కొన్న 12 సంస్థలనూ విభజించాలని ఏపి కోరగా తెలంగాణ పూర్తిగా వ్యతిరేకించింది. ప్రతి విషయంలోనూ అభ్యంతరాలు, అవాంతరాలు సృష్టించుకుంటూ పోతే విభజన సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని కేంద్రం పేర్కొంది. విభజన చట్టంలో పన్నులకు సంబంధించి 50, 51, 56 సెక్షన్ల లో లోపాలను సరిదిద్దేందుకు చట్టాన్ని సవరించాలని ఏపి ప్రభుత్వం కోరగా ఎనిమిదేళ్ల తర్వాత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ వాదించింది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju