Chandra babu : చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత. చిత్తూరు జిల్లా కుప్పం.. చంద్రబాబునాయుడి నియోజకవర్గం. 1989 నుంచి అక్కడ ఆయనకు తిరుగులేదు. అలాంటి నియోజకవర్గంలో ఉన్న పంచాయతీలపై అధికార వైసీపీ కన్నేసింది. ఈసారి ఆ కంచుకోటను బద్దలుకొట్టేందుకు అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో మూడో విడత పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
నేడే చూడండి!
టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో కూడా మూడ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే గెలుస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గినా.. ఇక్కడ పసుపు జెండా ఎగరడం మాత్రం ఆగలేదు. ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టాలనే వ్యూహంతో పనిచేస్తోంది అధికార వైసీపీ. గత ఎన్నికల్లో కుప్పం ఫలితాల మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు నాయుడు కాస్త వెనుకబడ్డారు. ఈ విషయం వైసీపీ నేతల మైండ్లో బాగా ఫిక్స్ అయింది. గట్టిగా ప్రయత్నిస్తే బాబు గారిని దెబ్బ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఇప్పటికీ వైసిపి నేతలు బలంగా నమ్ముతున్నారట. సొంతగడ్డపై చంద్రబాబుకు షాక్ ఇస్తే.. ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై బాగా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఎస్ఈసీకి చంద్రబాబు సంచలన లేఖ రాశారు.
కుప్పంలో అలా జరుగుతోందా?