నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) మంగళవారం పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన బ్యారేజీ కమ్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రతిపాదనలపై వివిధ అభివృద్ధి పనులకు దాదాపు రూ.85 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు సీఎం వైఎస్ జగన్. హైవే నుండి సంగం బ్యారేజీ వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లు, ఇరిగేషన్ పనులకు రూ.40 కోట్లు, 25 గ్రామాల్లో రోడ్లు వేయడానికి రూ.14 కోట్లు, స్పెషల్ గ్రాంట్ కింద రూ.12 కోట్లు కేటాయించారు.
సీఎం జగన్ సంకల్పాన్ని ప్రశంసించిన లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ
ఈ సందర్భంగా జరిగిన సభ లో సీ ఎం జగన్ మాట్లాడుతూ సంగం బ్యారేజీ వల్ల ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లోని అయిదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగా, ఆయన మరణానంతరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.200 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేయడం జరిగిందన్నారు. కోవిడ్, వరద సమస్యలు ఉన్నా మూడేళ్లలో ప్రాజెక్టు ను పూర్తి చేశామన్నారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో ఇచ్చిన మాట ప్రకారం బ్యారేజీకి పేరు పెట్టడం జరిగిందన్నారు. జలయజ్ఞం లో పెట్టిన 26 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని పూర్తి చేస్తామని జగన్ స్పష్టం చేశారు. 1904 నుండి నెల్లూరు లో బ్యారేజ్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ నిర్మించాలన్న డిమాండ్ ఉండగా, ఆ కల నేడు నెరవేరింది. ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్థన్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు .. 30 ప్రదేశాల్లో ఈడీ సోదాలు
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!