Eluru: ఏలూరు యాసిడ్ దాడి బాధితురాలు యడ్ల ఫ్రాంచిక (35) మృతి చెందింది. గత మంగళవారం ఏలూరులో ఆమె పై యాసిడ్ దాడి జరిగింది. విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో ఫ్రాంచిక చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. ఏలూరులోని జేవీఆర్ నగర్ లో నివాసముంటున్న యడ్ల ఫ్రాంచిక దుగ్గిరాల సమీపంలోని దంత వైద్య కళాశాలలో రిసెప్షనిస్టుగా పని చేస్తొంది. ఆమె భర్త రాజమండ్రిలో కెమికల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి మధ్య విభేదాలు రావడంతో రెండేళ్లుగా భర్తతో విడిపోయి తన అయిదేళ్ల చిన్నారితో తల్లిదండ్రుల వద్ద ఉంటొంది ఫ్రాంచిక.
గత మంగళవారం రాత్రి విధులను ముగించుకున్న తర్వాత ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఇంటికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్ తో దాడి చేశారు. ఆమె తల, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె పరుగులు తీస్తూ ఇంటికి రాగా కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఏలూరులో ప్రధమ చికిత్స అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తదుపరి అక్కడ నుండి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఫ్రాంచిక అక్కడ చికిత్స పొందుతూ ఇవేళ మృతి చెందింది.
ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో ప్రమాదం .. 9 మంది కార్మికులకు గాయాలు..కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన