Vangaveeti Radha Krishna: దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా కృష్ణ తో వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డి రీసెంట్ గా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ మిథున్ రెడ్డి రాధాతో సమావేశం కావడంతో తిరిగి వైసీపీ చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు.
కొద్ది నెలల క్రితం రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో ఆయన జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధం అయ్యిందనీ, అందుకే నాదెండ్ల మనోహర్ ముందుగా ఆయనతో చర్చలు జరిపారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇంతకు ముందు రాధా సన్నిహిత మిత్రులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఆయనను వైసీపీలోకి అహ్వానించారని వార్తలు వచ్చాయి.
వంగవీటి రాధా కృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ పెద్ద గా యాక్టివ్ గా లేరు. దీంతో తరచు రాధా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. వాస్తవానికి దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్న రంగా అభిమానులు అహ్వానించినా కార్యక్రమాలకు రాధా హజరవుతూ వస్తున్నారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇలా పార్టీలు మారుతూ పార్టీకి కమిటెడ్ గా లేకపోవడంతో తరచు రాధా పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో జనసేన – టీడీపీ పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో కాపు సామాజిక వర్గ ఓటింగ్ వైసీపీకి దూరం కాకుండా చూసుకునేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ను పార్టీలో చేర్చుకుని ఆయన కు కాకినాడ పార్లమెంట్ స్థానం, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని భావిస్తొంది. అలానే వంగవీటి రాధా ను కూడా పార్టీలో చేర్చుకుని ఆయన కోరుకున్న స్థానాన్ని కేటాయించాలని చూస్తొందట.
కాగా, ఇటీవలే వంగవీటి రాధా వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా హజరైయ్యారు. రాధా మామగారు జనసేన పార్టీలో ఉన్నారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి వంగవీటి రాధా వైసీపీలో చేరతారా లేక జనసేన లోకి వెళతారా.. లేక టీడీపీలో కొనసాగుతారా అనేది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Janasena: జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే..?