Srikakulam: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రీకాకుళం పర్యటనలో మాజీ కేంద్ర మంత్రి, వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణికి అవమానం జరిగింది. హెలిపాడ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన కృపారాణిని పోలీసులు అడ్డుకున్నారు. సీఎంకు ఆహ్వానం పలికే నాయకుల జాబితాలో ఆమె పేరు లేదని చెప్పడంతో కృపారాణి అవాక్కయ్యారు. ఈ జాబితా తయారు చేసింది ఎవరు. కృపారాణి ఎవరో అధికారులకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమె అక్కడ నుండి వెనుతిరిగారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కృపారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ నుండి వెళ్లిపోతుండగా మంత్రి ధర్మాన ప్రసాదరావు వర్గీయులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు పొరబాటున జాబితాలో పేరు రాయలేదేమో వారితో మాట్లాడి జగన్ వద్ద కు తీసుకువెళతామని నేతలు ఆమెను సర్ది చెప్పాలని చూసినా కృపారాణి శాంతించలేదు. శ్రీకాకుళం నుండి కేంద్ర మంత్రిగా చేసిన కృపారాణి ఎవరో జిల్లా కలెక్టర్ కు తెలియదా, ఈ అవమానం తాను తట్టుకోలేను, ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లాలి అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం నందు సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అమ్మఒడి పథకం మూడవ విడత నిధులను విడుదల చేశారు.