ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ ఎస్ ఎల్ వి రాకెట్ ప్రయోగం సాంకేతికంగా విజయవంతం అయ్యింది కానీ డేటా అందలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి రాకెట్ ప్రయోగం ఈ ఉదయం జరిగింది. ఎస్ ఎస్ ఎల్ వి రాకెట్ ఈవీఎస్ 02, ఆజాధీ కా శాట్ అనే రెండు ఉపగ్రహాలను కక్షలోకి తీసుకువెళ్లింది. అయితే ఉపగ్రహ వాహన నౌక ప్రయోగం భౌతికంగా విజయవంతం అయిందా అన్నదానిపై ఉత్కంఠ సాగుతుంది. ఈ ప్రయోగంలోని అన్ని దశలు సజావుగా పూర్తి అయ్యాయని కానీ టెర్మినల్ దశలో సమాచార నష్టం జరిగినట్లు ఇస్రో ప్రకటించింది.
రాకెట్ ప్రయోగం జరిగిన 12 నిమిషాల్లోనే సాధారణంగా డేటా రావాల్సి ఉంటుందని ఇస్రో చెబుతుంది. ఎందుకంటే… తక్కువ కక్షలో వేసి పెట్టడానికి ఉద్దేశించినదే ఎస్ ఎస్ ఎల్ వి. కానీ ప్రయోగానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం మధ్యాహ్నం వరకు ఇస్రోకు అందలేదు. ఆజాదీకా శాట్ ఉపగ్రహ వాహన నౌక నుండి పోయిందని, కక్షలోకి చేరిందా లేదా అన్నది రాత్రికి గాని తెలియదని పేర్కొన్నది. ఎస్ఎస్ఎల్వీ రాకెట్, అది కక్షలో ప్రవేశపెట్టిన సాటిలైట్లకు సంబంధించి డేటాను విశ్లేషిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. రాకెట్ లోని వీటీఎం మాడ్యూల్ ఫంక్షన్ పనిచేయలేదని .. దీంతో కక్ష వేగాన్ని సాధించటం సాధ్యపడలేదని , మొత్తంగా ఉప గ్రహాలు కక్షను చేరుకోలేదని తెరుస్తోంది. ఈ విషయంపై ఇస్రో పూర్తిస్థాయి విశ్లేషణ తర్వాత ఫలితం పై ప్రకటన చేసే అవకాశం ఉంది.