JC Brothers: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మీద, వైసీపీ ప్రభుత్వం మీద కాస్త దూకుడుగా వెళుతున్నది జేసీ ప్రభాకరరెడ్డి అన్నది అందరికీ తెలిసిందే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్థత్వం ఉన్న జేసి ప్రభాకరరెడ్డి నియోజకవర్గంతో పని లేకుండా అనంతపురం జిల్లాలో టీడీపీ బాధ్యతలను తనపై వేసుకుంటాననీ, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా తాడిపత్రి మున్సిపాలిటీని గెలిపించారు జేసి ప్రభాకరరెడ్డి. టీడీపీలో దూకుడుగా వ్యవహరిస్తున్న జేసి ప్రభాకరరెడ్డి నివాసంలో రీసెంట్ గా ఈడీ తనిఖీలు జరిగాయి. ఈడీ అధికారులు జేసి నివాసానికి వెళ్లి ఇంట్లోకి బయటి వాళ్లను ఎవరినీ రానివ్వకుండా, ఇంట్లోని వారి అందరి సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని సోదాలు జరిపారు. ఈ సోదాల్లో ఈడీ అధికారులు ఏమేమి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు అనేది అధికారికంగా వెల్లడించలేదు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
JC Brothers: 2019 ఎన్నికలకు ముందూ..
అయితే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో టీడీపీ నాయకులు ఈడీకి టార్గెట్ అవ్వబోతున్నారా..? ఐటీకి, సీబీఐకి టార్గెట్ అవ్వబోతున్నారా..? అనే కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే.. 2019 ఎన్నికలకు ముందు అనేక మంది టీడీపీ నాయకుల ఇళ్లపై ఐడీ దాడులు జరిగాయి. మురళీమోహన్ కు చెందిన జయభేరీ సంస్థపై, అలానే కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కు చెందిన సదరన్ వ్యాపార సంస్థలపైనా, బీదా రవిచంద్ర తదితరులకు చెందిన హాస్పటల్స్, ఇతర వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. దాదాపు 30 మంది టీడీపీ మద్దతుదారుల వ్యాపార సంస్థలపై దాడులు చేపట్టి వారి ఆర్ధిక వ్యవహారాలు స్తంభించిపోయేలా ఐటీ రైడ్స్ జరిగాయి. ఇవన్నీ కూడా కేంద్రంలోని బీజేపీ మద్దతు జరిగాయని ఆనాడు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి చర్యల నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాల్లో పంపిణీలు చేయలేకపోయింది. టీడీపీ ఆర్ధిక మూలాలను అడ్డుకోగలిగారు.
టీడీపీలో ఆనాటి భయం మళ్లీ
ఇప్పుడు జేసి దివాకరరెడ్డి నివాసంపై ఈడీ దాడులు చేయడంతో టీడీపీలో ఆనాటి భయం మళ్లీ మొదలైంది. అయితే వాస్తవానికి అప్పటి దాడులకు ఇప్పుడు జరిగిన సోదాలకు సంబంధం లేదు. రాజకీయంగా గతంలో కేసులు నమోదు చేసినప్పటికీ కేంద్ర పెద్దల మద్దతుతో ఈ దాడులు జరగలేదని సమాచారం. ఏడాదిన్నర క్రితమే అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై జెసి బ్రదర్స్ కు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీపై, దివాకర్ ట్రావెల్స్ పైనా కేసులు నమోదు చేశారు. దానిలో భాగంగా తాజాగా ఈడీ రైడ్స్ జరిగాయి తప్ప వేరే అదనంగా నమోదు చేసి కేసులు ఏమీ కావని తెలుస్తొంది. ఇది కొత్తగా నమోదు చేసిన కేసు కాదు, పాత కేసులకు సంబంధించినవే. 2019, 2020లోనే వాళ్ల సిమెంట్ ఫ్యాక్టరీల్లో రూ.120 కోట్ల అవినీతికి పాల్పడినట్లు నోటీసులు ఇచ్చారు. ఏసీబీ తనిఖీలు జరిగాయి. వాళ్లను అరెస్టు చేస్తామన్నారు. సీబీఐకి ఫిర్యాదులు వెళ్లాయి. ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా జేసి బ్రదర్స్ లొంగలేదు. పార్టీ మారడానికి ఒప్పుకోలేదు.
JC Brothers: 20 మంది లిస్ట్ అంటూ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం
ఇన్నాళ్లు వాళ్ల రాజకీయం సాగింది. ఇప్పుడు ఇడీ రంగ ప్రవేశం చేసింది. ఈడీ రంగ ప్రవేశం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నప్పటికీ ఎవరు చేయించారు..? ఎందుకు చేయించారు..? అనేది తర్వాత తెలుస్తాయి. అయితే దీనికి బీజేపీకి సంబంధం లేదు. కానీ టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం 20 మంది లిస్ట్ తయారు అయ్యింది. వాళ్ల ఆస్తులపైనా ఈడీ రైడ్స్ జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలంటూ వాళ్లకు వాళ్లే ప్రచారం చేసుకుని భయపడుతున్నారు. వాస్తవానికైతే కేంద్ర ప్రభుత్వ మద్దతుతో బీజేపీ సపోర్టుతో జరుగుతున్నది కాదని సుస్పష్టం. ఇది పాత కేసే, పాత లావాదేవీలకు సంబంధించిన వ్యవహారమే.