JD Lakshmi Narayana: జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ప్రాంతీయ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని జై భారత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు . రాజకీయాల్లో వ్యక్తి పూజ ఉంటే అది రాచరికానికి దారి తీస్తుందని, ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలో వ్యక్తి పూజే జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడం మంచిదని అన్నారు.
ఈ సందర్భంలో అంబేద్కర్ చెప్పిన ఓ విషయాన్ని గుర్తు చేశారు. నా విగ్రహాల కన్నా .. నా పుస్తకాల ద్వారా నన్ను గుర్తించండి అని అంబేద్కర్ చెప్పారని అన్నారు. రాజ్యాంగం చాలా గొప్పదే అయినా అధికారంలో ఉన్న పార్టీ రాజ్యాంగాన్ని సక్రమంగా ఉపయోగించకపోతే అది వృధానే అవుతుందని అన్నారు. ప్రజలు కూడా రాజ్యాంగాన్ని మంచిగా అమలు చేసే వారినే ఎన్నికల్లో ఎన్నుకోవాలని అన్నారు.
ఏపీలో బీజేపీని ఎప్పుడో ఓడించారని అన్నారు. కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం ప్రజాభిప్రాయానికి భిన్నంగా బీజేపీతో అంటకాగుతున్నాయని విమర్శించారు. గతంలో జయప్రకాష్ నారాయణ తరహాలో ఇప్పుడు వడ్డే శోభనాదీశ్వరరావు అందరినీ ఏకం చేస్తున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీలకు నాలుగు సార్లు కేంద్రాన్ని నిలదీసే అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదని, పైగా వారి స్వార్ధం కోసం కేంద్రం కాళ్ల మీద పడిన సందర్భాలు చూశామని అన్నారు.
ప్రత్యేక హోదా కు ప్రాంతీయ పార్టీలు ముగింపు పలికాయని అన్నారు. ఆ పార్టీలే ఇప్పుడు ముగిసిన అధ్యాయం అంటున్నాయన్నారు. ఎన్నికల్లో ప్రత్యేక హోదా స్లోగన్ కాదని ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి సాధించుకోవాలని అన్నారు. సంఘటిత శక్తి గా ఎదిగే పోరాటంలో జై భారత్ పార్టీ భాగస్వామ్యం గా ఉంటుందని అన్నారు. నల్ల చట్టాలు, జల్లి కట్టు పోరాట ల స్పూర్తి తో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని లక్ష్మీనారాయణ అన్నారు.
Atal Setu: ప్రధాని మోడీ ప్రారంభించిన అటల్ సేతు ..అతిపొడవైన ఈ సముద్రపు వంతెన ప్రత్యేకతలు ఇవి..