Kesineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్ సీపీలో చేరిక ఖాయం అయ్యింది. తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖ ను లోక్ సభ స్వీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్వీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన కేశినేని నాని .. తక్షణం రాజీనామా ను ఆమోదించాలని కోరారు. అలానే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు.
అంతకు ముందు కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో చంద్రబాబు మోసగాడని విమర్శించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన బాబు.. రాష్ట్రానికి పనికి రాని వ్యక్తి అని అన్నారు. విజయవాడ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ అవుతుందని నాని పేర్కొన్నారు. విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని పేర్కొన్నారు.
చంద్రబాబు మోసగాడు అని తెలిసి కూడా నియోజకవర్గం కోసమే ఇంతకాలం టీడీపీలో ఉన్నానని నాని అన్నారు. పార్టీలో ఎన్నో అవమానాలను ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట ఉండాలని ఇప్పుడు నిర్ణయించుకున్నానని చెప్పారు. స్పీకర్ తన రాజీనామా ఆమోదించిన తర్వాత వైసీపీలో చేరనున్నట్లు కేశినేని వెల్లడించారు.
YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్