Michaung Cyclone: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడిన మిచౌంగ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చుపుతోంది. తుఫాను కారణంగా ఏపితో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుఫాను హఠాత్తుగా దిశ మార్చుకుంది. ప్రస్తుతం సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతం అయ్యింది. దీంతో సూళ్లురుపేట ఇప్పటికే జలదిగ్భంధంలో చిక్కుకుంది. రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం అందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా మనుబోలు, కలువాయి, నెల్లూరులో విపరీతమైన ఈదురు గాలులతో భారీ వర్షం పడుతోంది.
ఇవేళ అర్ధరాత్రి లోపు నెల్లూరు – కావలి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మిచాంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తొలుత మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందని భావించారు. కానీ ఇది ఆకస్మాత్తుగా తన దిశ మార్చుకొని నెల్లూరు – కావలి మధ్యలో తీరం దాటే పరిస్థితి ఉందని వాతావరణ శాక అధికారులు చెబుతున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వెల్లడించింది.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో రాబోయే రెండు రోజులు ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరిస్తొంది. మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బాపట్ల చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. 14 పునరావ కేంద్రాలను 800మందిని తరలించారు. 43 తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 350 మంది గజ ఈతగాళ్లను సిద్దం చేశారు. నిజాంపట్నం హార్బర్ లో పదవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
Michaung Cyclone: మిచౌంగ్ తుఫాను .. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్