Bear attack: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో ఎలుగుబంటి జనాలపై దాడి చేసింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఎలుగుబంటి దాడిలో ఏడుగురు గాయపడగా, వారిని వెంటనే స్థానికులు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరు మృతి చెందగా, మిగిలిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులకు వైద్యసేవలు అందిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలుగు బంటి దాడులతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.