టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కేశవ్ కు ప్రభుత్వం సెక్యురిటీని ఉపసంహరించింది. ఆయన వద్ద పని చేస్తున్న గన్ మెన్లు వెనక్కి రావాలని ఆదేశించింది. నిన్నటి వరకూ పయ్యావుల వద్ద 1 ప్లస్ 1 భద్రత ఉంది. పయ్యావుల కేశవ్ కు సెక్యూరిటీ ఉప సంహరణపై టీడీపీ వర్గాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పయ్యావుల మూడు రోజుల క్రితం వివరణ ఇవ్వడంతో పాటు తమ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పయ్యావుల సెక్యూరిటీని తొలగించిందని టీడీపీ నేతలు అంటున్నారు. తనకు సెక్యూరిటీ పెంచాలని కొద్ది రోజుల క్రితమే పయ్యావుల ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ తరుణంలో ఆయనకు ఉన్న సెక్యురిటీని కూడా తొలగించడం హాట్ టాపిక్ అయ్యింది.
శ్రీలంక అధ్యక్షుడి నివాసంలో నిరసనకారుల హాల్ చల్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు