Breaking: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన పలువురు కారులో భద్రాచలం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా ఆరుగురు మృతి చెందారు.
కారులో ఉన్న మరి కొందరు గాయపడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులు ఛత్తీస్గడ్ రాష్ట్రం వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో షాక్