Nitin Gadkari: ఓ పక్క పార్టీ పరంగా బీజేపీ నేతలు రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంపై రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారు. కానీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న కేంద్ర మంత్రులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. గత నెల రాష్ట్ర పర్యటనలకు విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ తర్వాత వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ విమర్శించారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవేళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుపతిలో రూ.2,900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రూ.500 కోట్లతో ఏపి ప్రభుత్వం – నేషనల్ హైవే సంస్థ మధ్య ఎంవోయూ కుదిరిందన్నారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ సెంట్రల్ బస్ స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్కక్ టెక్ నిర్మాణం చేస్తామని అన్నారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర నిధులు రాబట్టడంలో పని తీరు కనబరుస్తున్నారని గడ్కరీ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు మేజర్ పోర్టులను అభివృద్ధి చేస్తొందన్నారు. దేశంలోనే విశాఖపట్నం మేజర్ పోర్టు అని, దాని అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ఏపీలో మరింత పారిశ్రామికాభివృద్ధి జరుగనుందని తెలిపారు. దేశంలో ఏడు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు అభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలిపారు.
కాగా తిరుపతి ఎంపీ గురుమూర్తి .. కేంద్ర మంత్రి గడ్కరీకి పలు విజ్ఞప్తులు చేశారు. రూ.500 కోట్లతో తిరుపతి బస్టాండ్ విస్తరణ చేయాలని గడ్కరీని కోరారు. కపిల తీర్ధం నుండి అంజిమేడు రోడ్డడు అభివృద్ధి చేయాలని కోరారు. తడ – శ్రీకాళహస్తి మద్య స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చాలనీ, తిరుపతి – తిరుత్తణి – చెన్నై జాతీయ రహదారిని సిక్స్ లైన్స్ జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.
NIA Court: హైదరాబాద్ సహా దేశ వ్యాప్త బాంబు పేలుళ్ల కేసులో నలుగురు ఉగ్రవాదులకు పదేళ్ల జైలు శిక్ష