NIA Court: దేశ వ్యాప్తంగా పలు చోట్ల జరిగిన పేలుళ్ల కేసులో నలుగురు ఇడియన్ ముజాహిదీన్ తీవ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు జైలు శిక్ష విధించింది. నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఒబేదుర్ రెహమాన్, ధనీష్ అన్సారీ, అఫ్తాబ్ ఆలం, ఇమ్రాన్ ఖాన్ లు దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు పాల్పడి గందరగోళం సృష్టించేందుకు కుట్ర చేశారు.
వీరు గతంలో వివిధ పేలుళ్ల కేసులతో సంబందం ఉండటంతో పాటు హైదరాబాద్ పేలుళ్లతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించి ఎన్ఐఏ అధికారులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ నిషేదిత సంస్థ తరపున పని చేస్తున్న ఈ నలుగురు సానుభూతిపరులకు హైదరాబాద్, బెంగళూరు పేలుళ్లలోనూ హస్తం ఉన్నట్లుగా ఎన్ఐఏ అధికారులు రుజువు చేశారు. అదే విధంగా వారణాసి, ముంబాయి, ఫజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలో వీరి పాత్ర ఉందని చెప్పారు. అందుకు తగిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. దీంతో నిందితులు ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది ఎన్ఐఏ కోర్టు.
హైదరాబాద్ కోఠిలోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్ వద్ద 2007 అక్టోబర్ 25న ఈ ముఠా బాంబు దాడులు చేసింది. ఈ బాంబు దాడుల్లో 42 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరు వికలాంగులుగా జీవనం సాగిస్తున్నారు. గోకుల్ చాట్ షాపు పేలుడులో 33 మంది, లుంబినీ పార్క్ వద్ద పేలుళ్లలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్ సుఖ్ నగర్ లో 2013లో జరిగిన జంట పేలుళ్లలో 17 మంది చనిపోగా వందలాది మంది గాయపడ్డారు. రద్దీగా ఉండే ఆనంద్ టిఫిన్ సెంటర్ తో పాటు బస్టాండ్ లో పేలుళ్లు జరిగాయి. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడినట్లు ఎన్ఐఏ దృవీకరించింది.
ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి .. ఆ వెంటనే జగన్ సర్కార్ పై మాటల దాడి