దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణేన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అల్లుడుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుమార్తెగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా రాష్ట్రపతి భవన్ ఆవరణలో జేపీ నడ్డాతో దుగ్గుబాటి పురందరేశ్వరి, దుగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు, నారా చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం ప్రారంభం అయిన తర్వాత జేపీ నడ్డా పక్కన చంద్రబాబు కూర్చుని మాట్లాడారు.
అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దగ్గుబాటి పురందరేశ్వరి అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో దగ్గుబాటి పురందరీశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ యే పురందరీశ్వరి చదువుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇవేళ ఢిల్లీలో జేపీ నడ్డాతో చంద్రబాబు మాట్లాడటంపైనా పురందరీశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ఇంతకంటే ఆధారం కావాలా.. చిన్నమ్మా.. పురందేశ్వరి అంటూ ప్రశ్నించారు. పతీసమేతంగా మరిదిని తీసుకువెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం. బీజేపీకి తెలీదా, మీరంతా ఒక్కటే అని. అందుకేకదా దొంగ చేతికి తాళం ఇచ్చింది. అంటూ సెటైర్ వేశారు.
‘ఢిల్లీ సాక్షిగా కుట్రలు చేయడం మీ మరిది గారికి అలవాటే. కానీ ఈ సారి మిమ్మల్నీ తీసుకువెళ్లి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి.. అదీ హైలైట్. చంద్రబాబు జీవితంలో ఎవ్వరికీ విశ్వసనీయమైన స్నేహితుడు కాలేడన్న కమ్మటి వాస్తవం ఢిల్లీ నుండి గల్లీ దాకా అందరికీ తెలుసు’ నని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీ సాక్షిగా కుట్రల చేయడం మీ మరిది గారికి అలవాటే. కానీ ఈసారి మిమ్మల్నీ తీసుకెళ్లి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి…అదీ హైలైట్. చంద్రబాబు జీవితంలో ఎవ్వరికీ విశ్వసనీయమైన స్నేహితుడు కాలేడన్న కమ్మటి వాస్తవం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరికీ తెలుసు. pic.twitter.com/zhQlG8r5sl
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2023