రాజకీయం.. క్రైమ్.. ఈ రెండు పుస్తకం, అక్షరము లాంటివి. ఇంకా చెప్పుకోవాలంటే సెల్ ఫోన్.. స్క్రీన్ గార్డ్ లాంటివి. ఒకటి ఉంటేనే ఒకటికి విలువ అని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలాసార్లు నిరూపితమైంది. పార్టీల్లో నేరగాళ్లు, క్రైమ్ చరిత్ర ఉన్న వాళ్ళు ఉంటారు. అది సహజమే. అటువంటి వారికి రాజకీయమే సరైన రక్ష. అందుకే దేశంలో గుర్తింపు ఉన్న ప్రతి పార్టీలోనూ అటువంటి వాళ్ళు ఉంటారు. ఏ నేర చరిత్ర లేని వాళ్ళు ఉంటారు. ఎం పి, ఎమ్మెల్యే లలో కూడా 50 శాతానికి పైగా నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉంటారని అనేక సర్వేలు, అధ్యయనాలు చెప్పాయి. సరే..ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు అంటే.. ఏదైనా సంచలన క్రైమ్ జరిగితే దానికి బాధ్యుడు ఏ పార్టీకి చెందిన వాడా అని వెతకడం, ప్రత్యర్థి పార్టీ కి అంటించి వేయడం కంటే చేయడం దేశ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. ప్రస్తుతం దేశంలో రెండు క్రైమ్ ఇన్సిడెంట్లు, ఇద్దరు నేరగాళ్ళు హాట్ టాపిక్ గా ఉన్నారు. వాళ్లు ఏ పార్టీకి లింక్ పెడితే ఆ పార్టీ డామేజ్ చేయవచ్చని ప్రత్యర్థిపార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. వల్లే ఇప్పుడు ఆ వ్యూహాలకు ఆయుధంగా మారారు.
వికాస్ దూబే తెలుసుగా..అయన ఎ పార్టీ అంటే..?
వికాస్ దూబే..కరుడు కట్టిన నేరస్తుడు. గ్యాంగ్ స్టర్. యూపీలో ఎనిమిది మంది పోలీసులను కాల్చిపారేసిన కేసులో ప్రధాన నిందితుడు. ఇతనిపై క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించి చాలా కాలం పాటు పోలీసులు వెతికారు. చివరికి రెండు రోజుల కిందట పెట్టుబడి నిన్న ఎన్కౌంటర్ లో హతమయ్యారు. ఇపుడు ఇతని నేర చరిత్ర, ఇతని రాజకీయ లింకులు, ఈయన నేరాలు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చర్చనీయాంశాలుగా మారాయి.ఈయన బిజెపికి చెందిన వాడు, బిజెపి మద్దతు దారులతో, బిజెపి మంత్రులతో అనేక సార్లు కలిసి ఫోటోలు దిగారు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ హయంలోనే వికాస్ దూబే ఎక్కువగా నేరాలు చేసారంటూ బిజెపి ప్రచారం చేస్తుంది. వాటికి తగ్గట్టు బిజెపి నాయకులతో, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు అమిత్ షా, ఉమా భారతి, రాజ్ నాథ్ సింగ్ తదితరులతో కూడా వికాస్ దూబే కలిసినట్టు, వారితో మంతనాలు జరిపినట్టు అనేక ఫోటోలు పుట్టుకొచ్చాయి. మార్ఫింగ్ మాయాజాలంలో ఏది నిజమో, ఏది అబద్దమో పసిగట్టలేక వెబ్ మీడియా బానిసలు సతమతమవుతున్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, పంజాబ్, ఢిల్లీ వంటి నార్త్ రాజకీయాల్లో ప్రస్తుతం వికాస్ దూబే టాపిక్ ఆనోటా ఈనోటా పాకుతోంది. దాంతో పాటు అత్యంత ఫార్వర్డ్ మెసేజ్ గా అతను బిజెపి, కాంగ్రెస్ నాయకులతో దిగిన ఫోటోలే చక్కర్లు కొడుతున్నాయి. అంటే వికాస్ దూబే చేసిన క్రైమ్ మరకని ఆ పార్టీ మీద వేయాలంటూ ఈ పార్టీ, ఈ పార్టీ మీద వేయాలంటూ ఆ పార్టీ చూస్తూ చమటలు పట్టించుకుంటున్నాయి. సరే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.
బంగారు భామకు లింకులు ఎవరితో..?
ఇక కేరళలో స్వర్ణ సుందరి అలియాస్ స్వప్న సురేష్ విషయానికి వద్దాం. పదవ తరగతి ఫెయిల్ అయిన ఈ యువతి సీఎం ఆఫీస్ లో చక్రం తిప్పే స్థాయికి చేరుకుంది. ట్రావెల్ ఏజన్సీ నడిపోయింది. ఎయిర్ పోర్ట్ లో పని చేసింది. చివరకు ఒక ఐఏఎస్ ను పరిచయం చేసుకొని సీఎం కార్యాలయంలోనే చక్రం తిప్పింది. ఆలా దుబాయ్ నుంచి కేరళకు బంగారాన్ని స్మగ్లింగ్ చేసే అతి పెద్ద నేరంలో భగస్యామిగా, సూత్రధారిగానూ, పాత్రధారిగానూ మారింది. ఈ కేసు కేరళ రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. మరి దీనిమీద కూడా సోషల్ మీడియా బానిసలకు, వెబ్ మీడియా బానిసలకు పని పెట్టాలిగా. టెస్ట్ లుపెట్టాలి కదా. అందుకే ఈమె సీపీఎం మంత్రులతో ఉన్న ఫోటోలు, బిజెపి నాయకులతో ఉన్న photoli ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏది నిజమో..ఏది అబద్దమో..ఈ క్రైమ్ చరిత్ర ఉన్న స్వప్న సుందరి ఏ పార్టీకి అనుకూలంగా ఉండేది అని తెలుసుకోవడానికి వెబ్ బానిసలు సతమతమవుతున్నారు. నిన్న సాయంత్రం ఒక ఫోటో చుస్తే ఏకంగా ఆమె చేతిపై పినరయి అన్న టాటూ కూడా ఉండటం సోషల్ మీడియాలో సంచలనానికి దారితీసింది. ఒక సారి సీపీఎం పార్టీకి చెందిన కేరళ ఆర్ధిక మంత్రితో ఫోటో, ఇంకో సారి పినరయి విజయాన్ టాటూ ఉన్న ఫోటో, ఇంకో సారి బిజెపి నాయకులతో కలిసి తిరుగుతున్న ఫోటో ఇలా అనేక ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఇలా దేశంలో ప్రస్తుతం రెండు రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు, వికాస్ దూబే కేసులో పార్టీలు ఒకరిపై ఒకరు మరకలు వేసుకుంటున్నాయి. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ ల మాయాజాలం అంటే. ఏది ఒరిజినల్, ఏది మార్ఫింగ్, ఏది ఫేక్, ఏది రియల్ తెలుసుకోలేక వెబ్ మీడియా బానిసలకు అతి పెద్ద తలనొప్పి ఎదురవుతోంది.