చంద్రబాబునాయుడు స్ట్రేటజీలన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన ఎత్తులు ఎవ్వరికీ దొరకవు. ఎవరిని ఎలా కొట్టాలో బాగా తెలిసినోడు. రాజకీయాల్లో పండితుడు. అందుకే కదా.. ఒకరు స్థాపించిన పార్టీకి అధ్యక్షుడు అయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు ప్లాన్ ఒక్కటే.. జగన్ పట్ల రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడం. దాని కోసం కులాలను పట్టాలెక్కించారు.
దానిలో భాగంగానే కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా సీఎం జగన్ ను చిత్రీకరించాలనుకున్నారు బాబు. కానీ.. ఇక్కడే బాబు ప్లాను బెడిసి కొట్టింది. బాబు తన గోతి తానే తీసుకునేలా జగన్ బాబుకు షాకిచ్చారు. తన వేలితో తానే పొడుచుకునేలా జగన్ చేశారు. నిజంగానే ఆ పని జగన్ చేశారా? లేక పరిస్థితులే ఆయనకు అనుకూలించి.. బాబుకు అనుకూలించలేదా? అనేది పక్కన పెడితే… ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గం మొత్తం చంద్రబాబుపై ఫైర్ అవుతోంది.
ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి. మొత్తం కమ్మ సామాజిక వర్గానికే చంద్రబాబు చీడపురుగు లాంటోడు అని వంశీ అనేశాడు. చంద్రబాబుకు కుల పిచ్చి.. కానీ సీఎం జగన్ ఏనాడూ కులాలు, మతాలను చూసి విభజిస్తూ చూడలేదు. రమేశ్ హాస్పిటల్స్ మొత్తంలో జరిగిన వ్యవహారం కూడా అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఎందుకు ఆ ఆసుపత్రి వ్యవహారంలో తలదూర్చారో కూడా అందరికీ తెలుసు.. అంటూ చంద్రబాబుకే రివర్స్ పంచ్ ఇచ్చాడు వంశీ.
మరోవైపు ఏపీ మంత్రి కొడాలి నాని కూడా చంద్రబాబును ఓ రేంజ్ లో ఆడుకున్నారు. చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడు కాదు.. కమ్మ సంఘం అధ్యక్షుడు అంటూ నాని ఆరోపించిన సంగతి తెలిసిందే. కులం అభివృద్ధి కోసం పాటుపడేవాళ్లను చూశాం కానీ.. తప్పు చేసిన మనుషులను వెనకేసుకొచ్చి… దానికి కులం రంగును పూసి వేరే వాళ్లపై విషం చిమ్మే చంద్రబాబు లాంటి వారిని మాత్రం ఎక్కడా చూడలేదు. ఒక్క చంద్రబాబులోనే అటువంటి వాళ్లను చూస్తున్నాం.. అంటూ నాని కూడా చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు.
ఇక.. ఇంకో వ్యక్తి.. మోహన్ బాబు.. యాక్టర్ కమ్ పొలిటిషియన్. ఈయన చంద్రబాబు పేరు ఎత్తితేనే మండిపడుతున్నారు. నేను, ఆయన కలిసి వ్యాపారం మొదలు పెట్టాం. ఆ తర్వాత ఆ వ్యాపారాన్ని మొత్తం తన సొంతం చేసుకున్నాడు. అతడు చచ్చిన పాముతో సమానం. నన్ను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు.. అంటూ చంద్రబాబుపై తెగ ఫైర్ అయ్యారు మోహన్ బాబు.
ఇక మనకు అర్థం అయ్యేది ఏంటంటే… ఎవరో కాదు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే… చంద్రబాబుపై ఎక్కుతున్నారు. నేను కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్ధరించాను.. అని అంటున్న బాబును టార్గెట్ చేసింది కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. అందుకే.. బాబు తను తీసుకున్న గోతిలో తానే పడ్డారు.