YSRCP MLC ; ఏపీలో ఎన్నికలకు గిరాకీ ఏర్పడింది. పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఆ వెంటనే పరిషత్ ఎన్నికలకు ముహురహెతాలు ఫిక్సవ్వగా… ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. ఎమ్మెల్యే కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నాలుగుతో పాటూ ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు స్థానాలను కూడా భర్తీ చేయాల్సి ఉంది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలు వైసిపికి దక్కనున్నాయి. అందుకే వైసిపిలో ఇప్పటికే సందడి మొదలయింది. ఆ ఆరుగురు ఎవరా..? అనే ఆరాలు మొదలయ్యాయి. సీఎం జగన్ మనసులో ఎవరున్నారో అంటూ నేతల మధ్య చర్చలు నడుస్తున్నాయి.
YSRCP MLC ; టీడీపీలా కాదు.. జగన్ రూటే సెపరేటు..!!
అదే టీడీపీ అధికారంలో ఉంటూ.. ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే అవకాశం చంద్రబాబు చేతిలో ఉంటె రాజకీయం వేరేలా ఉండేది. ఎమ్మెల్సీ పదవులు ఆశించే వాళ్ళు నెల రోజుల ముందు నుండి పైరవీలు, లాబీయింగులు నడిపేవారు. చంద్రబాబు కార్యాలయం ముందే తేదీ జనార్దన్, వీవీవీ చౌదరి, సుజనా చౌదరి, నారాయణ, సీఎం రమేష్ లాంటి వాళ్ళని పట్టుకుని తెగ తిరిగేవారు. తరచూ లాబీయింగులు, ఫోన్లు, ఐవీఆర్స్ అంటూ హడావాడి నడిచేది. ఈ లోగా లోకేష్, పైన సిఫార్సులు అంటూ పార్టీ వ్యవహారమే వేరేలా ఉండేది. కానీ జగన్ దగ్గర ఆ అవకాశమే లేదు. జగన్ కి ఒక క్లారిటీ ఉంది. ఎన్ని పదవులు ఉన్నాయి..? ఎవరికీ ఇవ్వాలి..? అనే దిశగా స్పష్టమైన క్లారిటీ ఉంటుంది. అందుకే వైసిపిలో ప్రస్తుతం లాబీయింగులు, పైరవీలు ఏమి జరగడం లేదు కానీ.. రకరకాల ప్రచారాలు మాత్రం జరుగుతున్నాయి..!!
ఈ పేర్లు ప్రముఖం..! ఇప్పుడు రాకపోయినా రెండు నెలల్లో మళ్ళీ..!!
ప్రస్తుతం ఆరు స్థానాలను భర్తీ చేయనున్నారు. మళ్ళీ మే నెలలో నామినేటెడ్ ఎమ్మెల్సీ నాలుగు ఖాళీ అవుతున్నాయి. ఆ వెంటనే జూన్ నెలలో స్థానిక సంస్థల కోటాలో 13 స్థానాలు భర్తీ కానున్నాయి. సో… ఇప్పుడు మిస్ అయినా… మరో మూడు నెలల్లో భారీగానే అవకాశాలు రానున్నాయి. అయితే ఇప్పుడు ఏ ఆరుగురికి ఇవ్వనున్నారు..? అనేది ఒక కీలక అంశంగా మారింది.
* చిలకలూరిపేటకి చెందిన మర్రి రాజశేఖర్ కి ఒకటి ఖరారైనట్టు తెలుస్తుంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వైసిపి ఇంఛార్జిగా ఉన్నారు. కానీ చివరి నెలలో జగన్ మాటతో విడదల రజని కోసం మర్రి రాజశేఖర్ సీటు వదులున్నారు. సో.., ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చే వీలుంది.
* పశ్చిమ గోదావరి జిల్లా వైసిపి నేత కొయ్యే మోషేను రాజుకి అవకాశం ఉండొచ్చు అంటున్నారు. ఆయన పదేళ్లుగా పార్టీలోనే ఉంటున్నారు. పార్టీ ఏర్పాటైన కొత్తలో పార్టీకి మూడేళ్ళ పాటూ జిల్లా అధ్యక్షుడిగా పని చేసారు. 2014 లో కొవ్వూరు సీటు ఇవ్వలేదని అలిగి, ఆవేశంలో టీడీపీలోకి వెళ్ళిపోయి… మళ్ళీ నెలరోజుల్లోనే వైసిపిలో చేరిపోయారు. సో.. ఈయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది.
* ఇక ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కి అవకాశం ఉండొచ్చు. పార్టీ వాణి బలంగా వినిపించడంలో.., టీడీపీపై పోరాడడంలో ఆమంచి అందరి కంటే ముందుంటున్నారు. ఇటీవల సీఎం జగన్ తో భేటీ సందర్భంగా ఆమంచికి జగన్ హామీ కూడా ఇచ్చారు. సో.. ఆయనకు ఈసారి ఇచ్చే వీలుంది. ఒకవేళ ఆమంచికి ఇవ్వలేకపోతే తూర్పుగోదావరి జిల్లా నేత తోట త్రిమూర్తులకు అవకాశం ఉండొచ్చు. ఈ ఇద్దరిలో ఒకరికి ఇప్పుడు, మరొకరికి జూన్ నెలలో ఉంటుందని సమాచారం.
* ఈ నలుగురితో పాటూ తిరుపతి మాజీ ఎంపీ, దివంగత బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి చక్రవర్తికి అవకాశం ఉండొచ్చు. ఆయనతో పాటూ లెల్ల అప్పిరెడ్డి, కూడిపూడి చిట్టబ్బాయ్ తదితరుల పేర్లు వరుసలో ఉన్నాయి..!!