Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ అనగానే ఆయన అభిమానులకే కాదు ప్రతీ ఒక్కరికీ టన్నుల్లో ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహాన్ని అసలు తగ్గించకుండా భారీ హిట్ ఇచ్చారు పవర్ స్టార్. అంతేకాదు వరుసగా 5 భారీ ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టారు. ఇక ఒకేసారి రెండేసి సినిమాలు చిత్రీకరణ చేసి తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయడంతో పాటు పెద్ద గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, కరోనా వేవ్స్ దెబ్బ పవన్ ప్లాన్స్ అన్నిటినీ తారుమారు చేశాయి.
గత ఏడాది దసరాకే రావాల్సిన భీమ్లా నాయాక్ సినిమా కరోనా కారణంగా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. సెకండ్ వేవ్ సమయంలో పవన్ కరోనా బారిన పడి చాలా నెలలు సెట్స్ లో అడుగుపెట్టలేదు. మళ్ళీ పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చి చక చకా భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేశాడు. అలాగే, హరిహర వీరమల్లు, సురేందర్ రెడ్డి సినిమాలను కంప్లీట్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టాలనుకున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు చిత్రాలను రిలీజ్ చేయాలనుకున్నారు.
Pawan kalyan: భీమ్లా నాయక్ మాత్రమే ఈ ఏడాది వస్తుంది.
కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో భీమ్లా నాయక్ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేకపోతున్నారు. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయితేగానీ నమ్మలేము. ఇక హరిహర వీరమల్లు ఈ ఏడాది రావడం కష్టమే అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తోంది. అందుకే ఇప్పట్లో ఏ సినిమా షూటింగ్ కోసం పవన్ సెట్స్లో అడుగుపెట్టే ఆలోచన చేయడం లేదట. కాబట్టి అన్నీ సినిమాల డేట్స్ రిలీజ్ డేట్ షెడ్యూల్ను బట్టి ఒక్క భీమ్లా నాయక్ మాత్రమే ఈ ఏడాది వస్తుంది. ఇది ఒకరకంగా పవన్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూసే.