Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో చేసిన తాజా చిత్రం `ఆచార్య`. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. సోను సూద్, జుష్ణు సేన్ గుప్తా విలన్లుగా నటించారు.
భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం తొలి రోజే ఫ్లాప్ టాక్ సొంతం చేసుంది. దీంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. తెలుగులో రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 29.50 కోట్లు, రెండో రోజు రూ. 5.15 కోట్లు, మూడు రోజు రూ. 4.07 కోట్ల షూర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. నాల్గొవ రోజు వచ్చే సరికి పూర్తిగా డ్రాప్ అయిపోయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
4వ రోజు ఈ సినిమా కేవలం రూ. 53 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల పరంగా నాల్గొవ రోజు ఆచార్య అత్యంత తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది. ఇక ఏరియాల వారీగా ఆచార్య 4 డేస్ టోటల్ కలెక్షన్స్ను ఓ సారి గమనిస్తే..
నైజాం : 11.79 కోట్లు
సీడెడ్ : 5.96 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.73 కోట్లు
ఈస్ట్ : 3.18 కోట్లు
వెస్ట్ : 3.31 కోట్లు
గుంటూరు : 4.52 కోట్లు
కృష్ణ : 2.91 కోట్లు
నెల్లూరు : 2.85 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ= 39.25 కోట్లు(57.05 కోట్లు~గ్రాస్)
———————-
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.50 కోట్లు
ఓవర్సీస్ : 4.43 కోట్లు
———————–
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= 46.18 కోట్లు(72.00 కోట్లు~గ్రాస్)
———————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 131.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య సినిమా రూ.132.50 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొదటి నాలుగు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా.. ఇంకా రూ. 86.32 కోట్ల రేంజ్ లో షేర్ వసూల్ రాబట్టాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టం కష్టమే అని అంటున్నారు.