తెలుగు సినీ పరిశ్రమ మరో క్యారెక్టర్ నటుడిని కోల్పోయింది. పూరి జగన్నాథ్, కృష్ణవంశీ వంటి ప్రముఖ దర్శకుల చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన నటుడు బోస్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోస్ ఆదివారం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంటూ వివిధ రకాల పాత్రలు పోషించారు బోస్. సుమన్ హీరోగా నటించిన ‘సాహసపుత్రుడు’ చిత్రంతో నటుడుగా పరిచయైమెన బోస్కు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమఖైదీ’ చిత్రం నటుడిగా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో సహాయ నటుడిగానే కొనసాగారు. ఆయన మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
previous post
next post