SVP: టాలీవుడ్ అందగాడు మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. సినిమా రిలీజై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఈ సినిమా. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై దుమ్ములేపే కలెక్షన్లు కురిపించింది. కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్ను సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆనంద్ మహీంద్రా ట్వీట్ దీనిగురించే:
తాజాగా ‘అనుపమ్ తరేజా’ సర్కారువారి పాట సినిమాలోని ఓ పాటను ట్వీట్ చేసాడు. సదరు వీడియోకు స్పందనగా రీట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. విషయం ఏమంటే ఆ పాటలో మహేష్ బాబు Jawa బైక్ ని వాడటం జరిగింది. దాన్ని ఉద్దేశిస్తూ… “అన్బీటబుల్ కాంబినేషన్ ఇది.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, జావా మెరూన్లను చూడకుండా ఎలా ఉండగలను. ప్రస్తుతం నేను న్యూయార్క్లో ఉన్నాను. న్యూ జెర్సీకి వెళ్లి సినిమా ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడికి వెళ్లి చూస్తాను.” అంటూ ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వైరల్ అవుతున్న ట్వీట్:
ఇకపోతే సోషల్ మీడియా పరిధి ఇవాళ పెరిగిన నేపథ్యంలో ఇలాంటి ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా మహేష్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. సినిమా బాలేదు అన్న నేపథ్యంలో… కలెక్షన్లు బాగా రావడం, సినిమా పాటలు హిట్ అవ్వడం, ఇలాంటి వారు సినిమాను సోషల్ మీడియాలో ప్రోమోట్ చేయడం వంటి విషయాలు వారిని సంతృప్తి పరుస్తున్నాయి. దాంతో వారు దానికి బదులుగా తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఉండటం కొసమెరుపు.