యాంకర్గా కెరీర్ను స్టార్ట్ చేసిన అనసూయకు జబర్దస్త్ కావాల్సినంత పేరుని తెచ్చిపెట్టింది. ఇప్పుడు సినిమాలపైన కూడా ఈమె సినిమాలపై కూడా ఫోకస్ చేసింది. క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు మరిన్ని సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. తాజాగా అనసూయ కొత్త దారిలోకి అడుగుపెట్టనుంది. సినీ వర్గాల్లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈమె త్వరలోనే నిర్మాతగా మారుతున్నారట. కంటెంట్ బేస్ చిత్రాలను నిర్మిస్తూనే యంగ్ టాలెంట్ను తన సినిమాల ద్వారా ఎంకరేజ్ చేయాలని అనసూయ భావిస్తుందట. మరి దీనిపై అనసూయ ఎలా స్పందించనుందో చూడాలి.
previous post
next post