నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `అర్జున్ సురవరం`. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం సరైన రిలీజ్ డేట్ దొరక్క.. డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ ఇవ్వక.. ఇలా పలు కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా 17న విడుదలవుతుందని వార్తలు వివనపడుతున్నాయి. లెటెస్ట్ సమాచారం ప్రకారం నిఖిల్ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దక్కించుకుందట. ఇంత పెద్ద సంస్థ నిఖిల్ సినిమాకు అండగా నిలబడటం లక్ అనే చెప్పాలి. మరి `అర్జున్ సురవరం` సినిమా సినీ వర్గాల్లో వినపడుతున్న సమాచారం మేర మే 17 అయినా విడుదవుతుందా? లేక వాయిదా పడుతుందా? అని తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.